Tuesday, 28 July 2026 09:10:33 PM
# కాకర్ల ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (PD) పనిచేస్తున్న చింతలపూడి యుగంధర్ మృతి. # అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వేను వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కార్పొరేషన్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందించిన మునిగడప. # ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు. # విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.

Date : 28 July 2026 07:09 PM Views : 106

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏఐటీయూసీ సమ్మె నోటీసుపై ఆర్ ఎల్ సి సమక్షంలో యాజమాన్యంతో రెండో విడత చర్చలు.మెడికల్ బోర్డుపై ఏఐటీయూసీ వాదనకు స్పందించిన ఆర్‌ఎల్‌సీ. రీ-మెడికల్ పరిశీలించాలని యాజమాన్యానికి సూచన.ఆగస్టు 6లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఆగస్టు 16 నుంచి అన్ని సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్తాం: ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ వెల్లడి.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. సస్వతీ రాథ్ సమక్షంలో రెండో విడత చర్చలు జరిగాయి.ఏఐటీయూసీ తరఫున అధ్యక్షులు వి. సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కె. రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు కె. వీరభద్రయ్య, వై.వి. రావు, ఎం.సమ్మయ్య పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పర్సనల్) బి. రాజగోపాల్ హాజరయ్యారు.సమ్మె నోటీసులో ప్రధాన డిమాండ్‌గా ఉన్న మెడికల్ బోర్డు అంశంపై యాజమాన్యం ఇప్పటికే బోర్డు నిర్వహించామని తెలిపింది. అయితే, బోర్డు ద్వారా పరీక్షించిన కార్మికులను పారదర్శకంగా ఫిట్ లేదా అన్‌ఫిట్‌గా ప్రకటించకపోవడంతో అనేక మంది కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐటీయూసీ వాదించింది.వాదనలను విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్,ఈనెల 17,18 మెడికల్ బోర్డులో పరీక్షించిన కార్మికులకు రీ-మెడికల్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యానికి సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా స్పష్టం చేశారు.అదేవిధంగా, తదుపరి చర్చలకు ముందే యాజమాన్యం, ఏఐటీయూసీ మధ్య ద్వైపాక్షిక సమావేశం నిర్వహించి సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని డిమాండ్లపై సానుకూలంగా చర్చించి, ఆ సమావేశ నివేదికను తదుపరి విచారణలో సమర్పించాలని ఆర్ ఎల్ సి ఆదేశించారు.ఇరు పక్షాలు పరస్పర చర్చల ద్వారానే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్, తదుపరి విచారణకు నిర్ణయాధికారం కలిగిన అధికారిని యాజమాన్యం తప్పనిసరిగా హాజరుపరచాలని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తదుపరి చర్చలను ఆగస్టు 6, 2026 ఉదయం 11 గంటలకు వాయిదా వేసినట్టు తెలిపారు.అనంతరం ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 6న జరిగే చర్చల్లో సమస్యలకు సానుకూల పరిష్కారం లభించకపోతే ఆగస్టు 16 నుంచి సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని వాసిరెడ్డి సీతారామయ్యా,కొరిమి రాజ్ కుమార్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :