తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాధించాలనే తపనతో శ్రమించడం ద్వారా తగిన విలువలను, ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఉదాహరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ రాణా ప్రతాప్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్జా బంగారు పథకాన్ని ప్రధానం చేశారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్లో ఎస్సై రాణా ప్రతాప్ కు ఉత్తమ పురస్కారం లభించింది. పోలీసుకు సంబంధించిన ప్రోగ్రాం ఎబిలిటీ సబ్జెక్టులో రాష్ట్రంలోనే ప్రధమునిగా నిలిచారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు చేతుల మీదగా గోల్డ్ మెడల్ పురస్కారాన్ని అందుకున్న ఎస్ఐ రాణా ప్రతాప్ కు తోటి అధికారులు మరియు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఎస్సై రాణా ప్రతాప్ కు అరుదైన గౌరవం దక్కడం పట్ల మండల వ్యాప్తంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ