Tuesday, 28 July 2026 09:24:56 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 23 December 2025 06:07 PM Views : 337

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కిన్నెరసాని ప్రకృతి సౌందర్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఏరు రివర్ ఫెస్టివల్‌లో భాగంగా మంగళవారం ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామం నుండి మొతలగూడెం వరకు కిన్నెరసాని రివర్ వాక్ కార్యక్రమాన్ని విజజయవంతంగా నిర్వహించారు. ఉదయం 8.00 గంటలకు ప్రారంభమైన ఈ రివర్ వాక్‌లో యువత పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని, కిన్నెరసాని నది పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, నదుల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, యువతతో కలిసి రివర్ వాక్‌లో పాల్గొని వారితో మమేకమయ్యారు. నది తీర ప్రాంతాల వెంట సాగిన ఈ వాక్ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలు, కిన్నెరసాని నది పరిసర ప్రాంతాల సహజ సంపద, అలాగే జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్టతను యువతకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాలు, నదులు, జలపాతాలు, ప్రకృతి వనరులు పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాల ప్రత్యేకతలను యువతకు వివరిస్తూ రివర్ వాక్ కార్యక్రమం ముందుకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కిన్నెరసాని నది జిల్లా జీవనాధారంగా ఉండటంతో పాటు పర్యావరణ సమతుల్యతకు కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. నది చుట్టూ ఉన్న పచ్చని అడవులు, సహజ వనరులు, జీవ వైవిధ్యం భవిష్యత్ తరాలకు కాపాడాల్సిన అమూల్యమైన సంపద అని తెలిపారు. ఈ ప్రకృతి సౌందర్యాన్ని సంరక్షించుకుంటూనే దేశ విదేశాలకు పరిచయం చేస్తే జిల్లాలో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏరు రివర్ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యం జిల్లాలోని నదుల, పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమేనని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రవాణా, స్థానిక ఉత్పత్తుల విక్రయాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వివరించారు. యువత సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా కిన్నెరసాని నది ప్రకృతి అందాలు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఫోటోగ్రఫీ, వీడియోలు, డాక్యుమెంటరీలు, రీల్స్, బ్లాగుల ద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సూచించారు. అదే సమయంలో నదులను కాలుష్యరహితంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు.జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి దిశగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి యం. పరంధామ రెడ్డి, స్థానిక అల్లపల్లి మండల ఎంపీడీవో శ్రీను, తహసిల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఎంఈఓ సంతా రావు, కృష్ణయ్య, గ్రామ సర్పంచ్ చిన్న పాపయ్య, పంచాయతే సెక్రెటరీ వరుణ్, టి ఎన్జీవోస్ ఉద్యోగ సంఘాల నాయకులు భార్గవ్ చైతన్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రెటరీ మహిధర్, నాగేంద్ర, ఆర్చెరీ కోచ్ కల్యాణ్, సైకిలింగ్ నాగేశ్వర రావు, ఉదయ్ కుమార్, టైక్వాండో రమేశ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్థానిక యువత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :