తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధి అన్నారపాడు గ్రామానికి చెందిన కొందరు యువకులు డ్రైన్ నిర్మాణం చేయాలంటూ ఎంపీడీవో పూరేటి అజయ్ కి వినతి పత్రం అందజేశారు.డ్రైన్ లేకపోవడం వలన వీధుల్లో నీరు పేరుకుపోతుంది అని, ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది మరియు రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఈ విషయాన్ని గ్రామ కార్యదర్శి కి, అధికార పార్టీ నాయకులతోపాటు, వైరా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అయినా సమస్య ను ఎవరు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని అధికార పార్టీ నాయకులు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎంపీడీఓ అజయ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపినట్లు వారు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉపేందర్, గణేష్, నవీన్, బాలు, మంజు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ