Tuesday, 28 July 2026 02:19:10 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆరోగ్యం క్షీణించి దంతెలబోర సిపిఐ సర్పంచి వెంకటరవణ మృతి. సర్పంచి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కూనంనేని.

Date : 25 July 2026 08:44 PM Views : 76

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆరోగ్యం క్షీణించి దంతెలబోర సిపిఐ సర్పంచి వెంకటరవణ మృతి. వెంకటరవణ మృతికి కూనంనేని, సాబీర్ పాషా సంతాపం. సర్పంచి కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే కూనంనేని. పాల్వంచ మండలం దంతెలబోర (ఎస్సీ కాలనీ) సిపిఐ పక్ష సర్పంచి సిడెం వెంకటరవణ (34) శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల కాలు గాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మొదట భద్రాచలంలోని మిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో భద్రాచలం వైద్యులు ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వెంకటరవణకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట భద్రాచలంలో అందించిన వైద్యం వికటించడం వల్లే ఆమె మృతిచెందిందని భావించిన కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. అయితే, చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలను వైద్య బృందం వారికి వివరించడంతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు నిరసనను విరమించుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన దంతెలబోరకు తరలించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించిన వెంకటరవణ మృతిపట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు వి. పూర్ణచందర్, అడుసుమిల్లి సాయిబాబు, యు. రాహుల్ తదితరులు తమ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజాసేవలో ముందంజలో ఉన్న యువ నాయకురాలిని కోల్పోవడం తీరని లోటని, వెంకటరవణ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారుభరోసా ఇచ్చారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :