తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రముఖ ప్రకృతి వైద్యులు గా పేరుగాంచడమే కాకుండా, ఆక్యుపంచర్సైన్స్, ఆక్యుప్రెషర్ సైన్స్, ఖైరో ప్రాక్టీస్ (మర్మకల ), డ్రగ్లెస్ థెరపీలో హీలర్ గా అంచలంచలుగా ఎదుగుతున్న . హెచ్ఆర్. జి. సుగుణారావు కప్పింగ్ థెరపీ (హిజామా) లో డిప్లమా కోర్సు పూర్తి చేసి, మరో సర్టిఫికెట్ ని అందుకున్నాడు. ఈనెల 24, 25, 26 వ తేదీలలో, విజయవాడలోని 'నేచురల్ హీలింగ్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన కప్పింగ్ తెరిపి డిప్లమా కోర్స్ పూర్తిచేసి, ఆ సంస్థ నిర్వాహకులు, ప్రముఖ ట్రైనర్, డాక్టర్. ఎస్. చెన్నఅప్పారావు చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నట్లు హీలర్ సుగుణారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆయన్ను కొత్తగూడెంలోనే ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు ప్రముఖ కవి జయరాజు, సభ్యులు డా.బి. కృష్ణయ్య, పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, మహమ్మద్ ముస్తఫా, సింగరేణి అవిశ్రాంత జిఎం శనగ వెంకటేశ్వర్లు, ఏజీఎం గోనే శ్రీకాంత్, కె హెచ్ ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు తుమ్మలపల్లి ప్రసాద్, తెలుగు వెలుగు ఛానల్, పూర్ణ మొబైల్ అధినేత పూర్ణ చందర్ రావు, ప్రముఖ సింగర్ వెంకట ముత్యం ల తో పాటు, తోటి హీలర్స్ స్వప్న, మంగ, రవికుమార్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుగుణారావు మాట్లాడుతూ..చాలా అద్భుతమైన కప్పింగ్ (హిజమా) పద్ధతుల ద్వారా సున్నత్, డ్రై, ఫైర్, అక్యుపంక్చర్, వాటర్, ఐస్, మాగ్నెట్, మోక్సా, హెర్బల్, మసాజ్ , ఫేషియల్, ఆయిల్ కప్పింగ్ పద్ధతులలో అనేక రకాల మొండి వ్యాధులను తగ్గించేందుకు వైద్య సేవలను అందిస్తానని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ