తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ మహాసభ జూలూరుపాడు లో ఈ నెల జూలై 5 న జరిగే మహాసభను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించి ప్రచారం నిర్వహించిన జిల్లా కార్యదర్శి ఎస్కె నాగుల్ మీరా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐవైఎఫ్ 1959 మే 3 న ఆవిర్భవించిందని దేశం కోసం ప్రాణాలర్పన చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు లాంటి అమరవీరుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని యువజన హక్కుల సాధనకై సామాజిక అభివృద్ధికై పాటుపడుతూ యువజన ఉద్యమాలను ముందుకు కొనసాగుతుందన్నారు. ఈ మహాసభల్లో ప్రధాన డిమాండ్లు :1) జిల్లాలో పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని.2) నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 5000 /-రూపాయలు తక్షణమే ఇవ్వాలని. 3) డ్రగ్స్ మత్తు పదార్థాలు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని. 4) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని.తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాన్ని తయారు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఖయ్యూమ్, ఏఐవైఎఫ్ పట్టణ నాయకులు గోపి, దిలీప్, భానోత్ శ్రీను, రసూల్, జావిద్, రవి,ఉదయ్, వెంకట్, రోహిత్, శ్రీకాంత్, హరీష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ