తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (D. I. E. O ) ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి' H. వెంకటేశ్వర్లు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,158 వేల కోట్ల రూపాయలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని, రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత చదువులకి వెళ్లకుండా చేస్తున్నారని దీని ద్వారా రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీలు సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజిత్ అన్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీల యజమాన్యం డబ్బులు డిమాండ్ చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించలేని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యపై దృష్టి సాధించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గుండాల సుజన్ జిల్లా సమితి సభ్యులు కమల్ నాయకులు మహేష్, రవి, వెంకటేష్, సునీల్, యోగి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ