తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : న్యాయవాదిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. న్యాయవాది హత్య పట్ల ఖండన.తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. హైదరాబాద్ అత్తాపూర్ లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని,హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు,తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శనివారం ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం లేకపోవడం మూలంగా న్యాయవాదులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.ఇంకా ఎంతమంది న్యాయవాదులపై దాడులు జరిగి,ఎంతమంది న్యాయవాదులు చనిపోయిన తర్వాత న్యాయవాదుల రక్షణ చట్టాన్ని చేస్తారని ప్రశ్నించారు??.15రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఇద్దరు న్యాయవాదులు హత్యకు గురికావడం హేయమన్నారు.న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడులుగా అభివర్ణించారు.న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని,హోమ్ శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ