తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియాలో జిఎం కార్యలయంలో తేదీ 31.10.2025 (శుక్రవారం)న జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమం ఘానంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … భారత దేశ తొలి హోం మంత్రి గౌరవ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐఖ్యతా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం రాక ముందు మన దేశం అనేక సంస్థానాలుగా ఉండేదని, ఉక్కు మనిషి శ్రీ సర్దార్ పటేల్ కృషి వల్లనే స్వాతంత్ర్యానంతరం అన్ని సంస్థానాల విలీనం జరిగిందన్నారు. ఐఖ్యత గా ఉంటే అన్ని సాదించగలం, ఇదే స్ఫూర్తితో ఐకమత్యంగా సింగరేణి లోనే మన కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ముందున్నామని అన్నారు ఇంత పెద్ద సంస్ధ లో మనందరం ఎన్నో కులాలు, మతాలకు చెందినవారమైనా గాని సమిష్టి కృషితో పనిచేస్తూ ఉత్తమమైన ఫలితాలను పొంది, కంపెనీ పురోభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అందరూ సమైఖ్యతతో సోదర భావంతో మెలగాలని అన్నారు. ఈ సందర్భంగా డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు గారు ఉద్యోగులందరిచే దేశ సమగ్రతను, ఐఖ్యతను, భద్రతను కాపాడటంలో అంకిత భావంతో వ్యవహరించాలని ప్రతిజ్ఞ చేశారు. అదే విదముగా కొత్తగూడెం ఏరియా లోని అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో కూడా ఆయా గనుల మేనేజర్లు మరియు ఆదిపతులు ఉద్యోగులందరిచే జాతీయ ఐఖ్యతా దినోత్సవ ప్రతిజ్ఞ చేపించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ వి. మల్లికార్జునరావు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ఏ.ఉపేంద్ర బాబు ఎస్ఓటు జిఎం జివి కోటిరెడ్డి, డిజిఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం (ఐఈ) ఎన్. యోహాన్, ఇతర విభాగాధిపతులు, అధికారులు మరియు జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ