Tuesday, 28 July 2026 06:58:42 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ ఆధ్వర్యంలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగి

Date : 23 September 2025 08:06 PM Views : 389

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికులకు ఇవ్వాల్సిన న్యాయమైన నికర లాభం నుండి 34% ఇవ్వాలని వి కే సి ఎం పివికె 5 షాఫ్ట్, ఎస్ ఎన్ పి సి, ఆర్ సి హెచ్ పి, కిష్టారం ఓసి జేవిఆర్ఓసి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు ఇచ్చే లాభాల్లో 75% పైగా కోత విధించారని ఆగ్రహం కాపు కృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.మొత్తం రూ. 6394 కోట్ల లాభాలు గడిస్తే, కేవలం 2360 కోట్లలో 34% ఇవ్వడం ఏమిటని సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహమే చేసింది.నమ్మి ఓటేసినందుకు సింగరేణి కార్మికులను నయ వంచన చేసిందనమండిపాటు*బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమం.. కాంగ్రెస్ పాలనలో ఘోరమైన సంక్షోభం అంటూ ఫైర్నికర లాభాల్లో కోట్లలో 34% ను కార్మికులకు బోనస్ గా ప్రకటించాలని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన కాపుకృష్ణ డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి కార్మికుల కడుపు మీద కొట్టి తీవ్ర నిరాశకు నెట్టారు. మొత్తం లాభం 6394 కోట్ల నుండి కాకుండా, 2360 కోట్ల నుండి బోనస్ చెల్లించడం దారుణం.పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను దారుణంగా మోసము చేశారు.మోసం చేసి, మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్ ను కూడా బోగస్ చేసారు.లాభాల వాటలో నికర లాభం నుండి సుమారు 75% కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా సుమారు 5 లక్షలు వస్తుందన్న కార్మికుల ఆశలను అడియాశలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.గతంలో కేసీఆర్‌ సర్కారు ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారు.కాంగ్రెస్‌ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గం.గతేడాది సింగరేణి భవిష్యత్‌ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,289 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఇప్పుడు 4034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారు! గత సంవత్సరం 33% ఇవ్వగా మిగిలిన 67% ఈ సంవత్సరం ఇస్తానన్న 34 శాతం మిగిలిన 66% తో ఏ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంక ఒకే సంవత్సరంలో సింగరేణి సంస్థ అభివృద్ధికి అని రెండుసార్లు అమౌంట్ ని ఉంచుతున్నారు.కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు?కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణం.కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకు పోయింది.కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చారు.సమైక్య రాష్ట్రంలో 1998-99 నుంచి 2010-11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 11నుండి 16 శాతమే. అప్పుడున్న ప్రభుత్వాలు యూనియన్లు 12 సంవత్సరాల లో 6% మాత్రమే పెంచడం జరిగింది. కానీ టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 16% నుండి 32 శాతం వరకు పెంచడం జరిగింది 10 సంవత్సరాలలో 16% పెంచడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నికర లాభం నుండి సింగరేణి సంస్థ అభివృద్ధి గాని దాదాపు నాలుగు వేల కోట్లు పక్కన పెట్టడం జరిగింది మరి కార్మికులకు ఇస్తున్న 34% ఇవ్వగా మిగిలిన 66% సింగరేణి సంస్థ అభివృద్ధికే కదా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని.2022-23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారు.లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కేసీఆర్‌ కే దక్కుతుంది.కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో చీకటి తొలగించాల్సిన ప్రభుత్వం చీకటి నింపే ప్రయత్నం చేస్తుంది.సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనిబి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34% బోనస్ గా ప్రకటించాలని వచ్చిన నికర లాభం నుండి 34% ఇస్తే సుమారుగా ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల వరకు వస్తాయి. టీబీజీకేఎస్ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంది. దీనిలో భాగంగా అన్ని మైన్స్ ల మీద అన్ని డిపార్ట్మెంటులలో అన్ని ఆఫీసులలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలియజేయాటం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపుకృష్ణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి టీబీజీకేఎస్. గడప రాజయ్య కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్.సెంట్రల్ కమిటీ మెంబర్ కాగితం విజయకుమార్, ఫిట్ సెక్రటరీ కుమార్ రాజ్ కుమార్ అశోక్ వెంకటేశ్వర్లు శ్రీకాంత్ విద్యాసాగర్ రాజేష్ అనుదీప్ రాజేశ్వరరావు తిరుపతయ్య పిచ్చయ్య తదితర కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :