Sunday, 26 July 2026 11:32:52 PM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.

Date : 25 July 2026 08:52 PM Views : 58

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జెన్కో రూ.54 వేల కోట్ల మొండి బకాయిపై సమీక్ష సమావేశంలో నోరు మెదపని ఉప ముఖ్యమంత్రి.54 వేల కోట్ల మొండి బకాయిని కనీసం వాయిదాల పద్ధతిలోనైనా చెల్లించండి.అవంతిక, డిప్‌సైడ్, కోయగూడెం, జేకే-5 ఎక్స్‌టెన్షన్ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలి.ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుంచి రావాల్సిన రూ.54 వేల కోట్ల మొండి బకాయిల అంశాన్ని సమీక్ష సమావేశంలో ప్రస్తావించకపోవడం నిరాశ కలిగించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య అన్నారు.శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెంలో జెన్కో, సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సింగరేణి ఆర్థిక పరిస్థితికి అత్యంత కీలకమైన బకాయిల అంశంపై చర్చ జరగాల్సి ఉండేదని పేర్కొన్నారు.జెన్కో బకాయిలను కనీసం విడతల వారీగా అయినా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని, సింగరేణి సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా సత్తుపల్లి అవంతిక ప్రాజెక్టు, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్, కోయగూడెం,ఇల్లందు జేకే-5 ఎక్స్‌టెన్షన్ వంటి బొగ్గు బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.దీంతో సంస్థకు భవిష్యత్తులో ఉత్పత్తి పెరిగి, వేలాది మంది కార్మికుల ఉపాధి భద్రపడుతుందని అన్నారు.రామ్ పురం మైన్ గ్యాసిఫికేషన్‌కు అత్యంత అనుకూలమైన గనిని తక్షణమే ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇది సింగరేణి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఇన్వాలిడేషన్ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న వారు, పక్షవాతం (పారాలిసిస్)తో పాటు వివిధ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి పరిస్థితిని మానవతా దృక్పథంతో పరిశీలించి ఇన్వాలిడేషన్ మంజూరు చేయడం ద్వారా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం,సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా ప్రకటన కోసం కార్మికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, ఆ ప్రకటనను వెంటనే విడుదల చేసి కార్మికులకు లాభాల వాటాను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :