తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలి.ప్రత్యేక క్యాంపులతో అవగాహన పెంచుతున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియ బాధ్యతగా చేపట్టాలి.బూత్ లెవల్ అధికారులకు పార్టీ శ్రేణులు సహకరించాలి.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య. ఓటు హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ప్రతిఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని బస్తీల్లో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అర్హులైన వారందరితో ఎస్ఐఆర్ ఫారాలను పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే ఈ సవరణ ప్రక్రియను ఒక బాధ్యతగా చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారులకు పూర్తి స్థాయిలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ తరఫున ఎంపికైన బూత్ లెవల్ ఏజెంట్లు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి యూసుఫ్, బోయిన విజయకుమార్, కూరపాటి సుధాకర్, బండి నర్సింహా, దుర్గయ్య, ధనలక్ష్మి, పడాల ఆకాంక్ష, ఎం హరిత, దాసరి శ్రీనివాస్, ఎర్రబెల్లి శంకర్, మునిగడప పద్మ, కంచర్ల హిమశ్రీ, పి సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ