తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సేవా సమితి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్ మొదలగు వృత్తి విద్య శిక్షణను ఆర్థిక సంవత్సరం 2024-25 లో పూర్తి చేసిన మహిళలకు రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు జి.మధురవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అందిస్తున్న ఉచిత స్వయం ఉపాధి శిక్షణను పొందిన మహిళలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఉండాలని అలాగే నిరుద్యోగతను తగ్గించుటకు మహిళలకు, గృహిణులకు ఈ అవకాశం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని మరియు ఈ వృత్తి శిక్షణను నేర్చుకున్న మహిళలు తమ ద్వారా ఇతరులకు జీవనోపాధి కల్పించే విధంగా ఉండాలని తెలియజేశారు. కొత్తగూడెం ఏరియా లోని రామవరం, గౌతంపూర్, రుద్రంపూర్, ధన్బాద్ సేవ సెంటర్స్ లలో టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు బ్యూటిషన్ కోర్సులలో వృత్తి శిక్షణను పొందిన మొత్తం 108 మంది మహిళలకు ఉదయం 10.00గంటలకు సి.ఈ.ఆర్ క్లబ్, రుద్రంపూర్ నందు రాత పరీక్ష నిర్వహించగా 99 మంది హాజరు కావడం జరిగింది మరియు సత్తుపల్లి లోని శిక్షణను పొందిన మొత్తం 90 మంది మహిళలకు సాయంత్రం 03.30 గంటలకు షాపింగ్ కాంప్లెక్స్ పి.వి. నరసింహా రావు కాలనీ నందు రాత పరీక్ష నిర్వహించడం జరిగింది మరియు 2023-24 బ్యాచ్ అభ్యర్థులకు పాస్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ పరీక్ష నిర్వహణ హైదరాబాద్ నుండి వచ్చిన సెంట్రల్ కో ఆర్డినేటర్ డి. శివ కుమార్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు తో పాటు, పద్మజా కోటి రెడ్డి గారు, లేడీస్ క్లబ్ సెక్రటరీ సునీత, సత్తుపల్లి లేడీస్ క్లబ్ సెక్రటరీ ఎన్. ఉషశ్రీ ప్రహ్లాద్, కొత్తగూడెం ఏరియా సేవ కో-ఆర్డినేటర్ సిహెచ్.సాగర్, సేవా సెక్రటరీ వై. అనిత, ఇతర వృత్తి శిక్షణ ఇచ్చు అధ్యాపకులు, సేవా సభ్యులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ