తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 34. 9 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్నాన ఘట్టాల వద్ద మెట్ల వరకు వరద నీరు చేరాయి. భక్తులు లోతుకు వెళ్లకుండా నది ఒడ్డునే స్నానాలు ఆచరించాలని అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ