తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఇటీవల మానసిక ఇబ్బందులతో గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం రమణారెడ్డి మృతదేహం నెల్లిపాక వద్ద లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. నాలుగు రోజులపాటు మృతదేహం గోదావరిలోనే ఉండడంతో ఉబ్బిపోయి ఉందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం మార్చురీకి తరలించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ