తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పేదల కష్టాలు, బాధలు తెలిసిన మహోన్నత వ్యక్తి కేఎల్ఆర్.లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో నేటితరం నడుచుకోవాలి.వందేళ్లైనా అయనా జ్ఞాపకాలు మర్చిపోలేం.లక్ష్మారెడ్డి 15వ వర్ధంతి సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా.కె ఎల్ ఆర్ విద్యాసంస్థల అధినేత, ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు అమరజీవి కాటిరెడ్డి లక్ష్మారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి sk సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ ఆదివారం స్థానిక కె ఎల్ ఆర్ ఘాట్ వద్ద లక్ష్మారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్ధంతి సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం-పాల్వంచ ఏజెన్సీలో విద్యా వ్యాప్తికి లక్ష్మారెడ్డి చేసిన కృషి మరువలేనిదిని, లక్ష్మారెడ్డి మొదటి నుంచి పోరాట పటిమ కలిగిన వ్యక్తి గా ఒక్కపడు విద్యార్థి నాయకుడుగా పేద విద్యార్థుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో అనేక విద్యా సంస్థలను స్థాపించి పేద విద్యార్థులకు విద్య అందించిన వ్యక్తని అన్నారు. పేదల కష్టాలు, బాధలు తెలిసిన మహోన్నత వ్యక్తి లక్ష్మారెడ్డిని ఎందరో పేద విద్యార్థులకు విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దిన లక్ష్మారెడ్డి అడుగుజాడల్లో నేటితరం నడుచుకుంటూ సేవా దృక్పథంతో ముందుకు సాగాలని కోరారు. వందేళ్లైనా లక్ష్మారెడ్డి జ్ఞాపకాలు మర్చిపోలేనని తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ