Monday, 27 July 2026 01:00:23 AM
# ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం. # ఎల్‌నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. # కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి.ఉప ముఖ్యమంత్రి భట్టికి వినతిపత్రం అందించిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # సింగరేణి సంస్థలో అత్యాధునిక జియో సైన్స్ లేబరేటరీని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు . # మహిళా సాధికారత కోసం అహర్నిశలు కృషి చేయాలి. జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా. # బోరు బావుల కింద వరి సాగుకు దూరంగా ఉండాలి – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు . # యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్‌సీసీ పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ అంకిత్. # అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి - మేయర్ మూడ్ గణేష్. # స్త్రీ నిధి రుణాల రికవరీకి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ . # ప్రతి విద్యాసంస్థలోని యువతను మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయాలి... అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. వేణు గోపాల్. # ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీర స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన. # సర్ ప్రోగ్రాం లో భాగంగా జూలూరుపాడు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే # ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి . # జూలూరుపాడు బంగారం షాపులో ఘరానా మోసం . # రెండు వర్గాల మధ్య ఘర్షణ ఘటన – ఇరువర్గాలపై కేసులు నమోదు, బైండ్ ఓవర్ చర్యలు.

MLC ఓటు నమోదు చేసుకోండి,విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి పాటుపడే వారికి మద్దతు నివ్వండి తీకుళ్ళ సాయిరెడ్డి

Date : 05 November 2024 06:28 PM Views : 847

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 5 (తెలుగు వెలుగు) మార్చి లో జరిగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ ఉపాధ్యాయ MLC ఎన్నికలలో అర్హత గల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు తమ ఓటును బాధ్యతగా భావించి వెంటనే నమోదు చేసుకోవలసిందిగా ఎ.పి. యు.ఎస్ మరియుటి.పి.యు.ఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు తీకుళ్ళ సాయిరెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ దండా మురళీధర్ రెడ్డి ఉపాధ్యాయులను ఆచార్యులను కోరారు. మంగళవారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ ను, జి.ప.ఉ.పా.జూలూరుపాడు, సుజాతనగర్,ఉపాధ్యాయులను కలిసి ఉపాధ్యాయ MLC ఓటు నమోదు చేసుకోవలసిందిగా కోరనైనది. వారితో మాట్లాడుతూ ఆన్ లైన్లో / ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకొనుటకు 1)దరఖాస్తు ఫామ్.19.....2)సర్వీస్ సర్టిఫికెట్ పైన ప్రిన్సిపాల్ సంతకం చేసిన సర్వీస్ సర్టిఫికెట్ కాపీ 3)ఓటరు ఐడి, 4).ఆధార్ కార్డ్, 5)పాస్పోర్ట్ సైజ్ ఫొటో ఉండాలన్నారు. 2019 లో ఉన్న ఓటర్ జాబితా పూర్తిగా రద్దయినందున ప్రతి ఒక్కరూ మళ్ళీ నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు.నమోదుకు రేపు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్నదని వెంటనే నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత మార్చి నుండి ఉద్యోగవిరమణ పొందిన వారు కూడా తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం విద్యారంగ, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ఆచార్యుల సమస్యలు, మెడికల్ కళాశాలల సమస్యలు పరిష్కరించ బడాలంటే, ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాలు కాపాడ బడాలంటే విద్యారంగ అభివృద్ధికి పాటుబడే జాతీయవాదులకు అండగా నిలిచి కౌన్సిల్ కు పంపాలని ఉపాధ్యాయులను సాయిరెడ్డి కోరారు. ,టిపియుఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు డి. సురేష్, ప్రధానకార్యదర్శి బి. కృష్ణ, మాజీ అధ్యక్షులు శివరామ కృష్ణ, పాండురంగాచారి, ప్రిన్సిపాల్స్,అధ్యాపకులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.తీకుళ్ళ సాయిరెడ్డి, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, ఎ పి యు ఎస్ మరియు టి.పి.యు.ఎస్.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :