తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మే 15 నుండి 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం "తిరుపతి"లో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం లోని రామవరం పట్టణం నందు విట్టల్ రావు మెమోరియల్ ఆఫీస్(విఎంఎ) నందు సమావేశం ఏర్పాటు చేయడమైనది. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె ఖయ్యూం పాల్గొని మాట్లాడుతూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ ను అమలు చేయాలని, ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, 2020 నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. యువజన హక్కుల కోసం యువత మార్పు కోసం యువత పనిచేయాలని మే 15 చలో తిరుపతి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మజ్జిగ రణధీర్, ఎస్.కె రసూల్, బానోతు శ్రీనివాస్, ఎన్. విజయరాజ్, నాగరాజు, ఎస్.కె సమీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ