Tuesday, 28 July 2026 04:17:15 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

యువత టూరిజం రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. యువ టూరిజం క్లబ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 18 May 2026 05:56 PM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే 18 నుండి 23 వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా “యువ టూరిజం క్లబ్” పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, యువత టూరిజం రంగంపై అవగాహన పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతలో పర్యాటక ప్రదేశాల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. టూరిజం వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మే 19న పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద టూరిజం అవేర్‌నెస్ డ్రైవ్, మే 20న లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ రాక్ కేవ్స్ వద్ద హెరిటేజ్ వాక్, మే 21న జిల్లాలోని యూట్యూబర్లతో సమావేశం, మే 22న బౌద్ధ రాక్ కేవ్స్ ప్రాంతంలో స్వచ్ఛత డ్రైవ్, మే 23న పాల్వంచలోని ఐడాక్‌లో బ్రాండ్ కిట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు .టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ” మరియు “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సులను యువత వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కోర్సుల ద్వారా పర్యాటక, పురావస్తు, మ్యూజియం రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజును సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9849905722, 9849905723

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :