Tuesday, 28 July 2026 04:41:39 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

' రైతునేస్తం' 100వ ఎపిసోడ్ విజయవంతం

Date : 28 July 2026 03:35 PM Views : 12

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ వ్యూహాలపై నిపుణుల సూచనలు పూసగూడెం రైతు వేదికలో రైతులతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అత్యధికసార్లు కార్యక్రమాన్ని వీక్షించిన రైతులకు జిల్లా స్థాయిలో సత్కారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం మంగళవారం 100వ ఎపిసోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, సుమారు మూడు లక్షల మంది రైతులు వర్చువల్‌గా పాల్గొని వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను తెలుసుకున్నారు. 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్రమోహన్, ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ వ్యూహాలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ పద్ధతులు, చీడపీడల సమగ్ర యాజమాన్యం, పోషక నిర్వహణ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సమగ్ర అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ములకలపల్లి మండలం పూసగూడెం రైతు వేదికనుండి జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులతో కలిసి వర్చువల్ ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న శాస్త్రీయ సలహాలను రైతులు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. నీటి వినియోగంలో పొదుపు పాటిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా నిర్వహిస్తున్న 'రైతునేస్తం' కార్యక్రమం రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించడంలో సమర్థవంతమైన వేదికగా నిలిచిందని కలెక్టర్ అన్నారు . పంటల సాగుకు సంబంధించిన సందేహాలకు నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సమాధానాలు పొందడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ఈ కార్యక్రమం విశేషంగా ఉపయోగపడుతోందన్నారు. 'రైతునేస్తం' కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని అత్యధికసార్లు వీక్షించిన ముగ్గురు రైతులను, కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతిభ కనబరిచిన మరో ఇద్దరు ఏ ఈ వోలను జిల్లా కలెక్టర్ అంకిత్ జ్ఞాపికలతో సత్కరించి అభినందించారు. రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు , వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :