తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (అర్బన్) భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ ,పట్టణ శాఖలే పునాది రాళ్ళని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సిపిఐ గ్రామ ,పట్టణ శాఖ మహాసభలో భాగంగా రామవరం నెహ్రూబస్తీ, లక్ష్మీ టాకీస్ ఏరియా 1,2, నేతాజీ బస్తి లో శాఖ మహాసభలు నిర్వహించారు. ప్రతి శాఖ కార్యదర్శి ప్రజలతో మమేకమై నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని వారికి సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలు ఉన్నంతవరకు, భూమి పై జీవం ఉన్నంతవరకు కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయని అన్నారు. ఈ నెల 19వ తారీకు రామవరం లో జరిగే డివిజన్ మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారికి పిలుపునిచ్చారు. అనంతరం కమిటీలను ప్రకటించారు .నెహ్రూ బస్తి లక్ష్మీ టాకీస్ ఏరియా 1, లక్ష్మీ టాకీస్ ఏరియా 2, నేతాజీ బస్తి శాఖ కార్యదర్శిగా రావుల దాసు, ముద్దం మార్తమ్మ, రామ్ రాకేష్, ఎస్కే అస్లాం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు అల్లకొండ మోహన్, ఓం నారాయణ, ఎస్ కే జానీ, తమ్మ సత్యనారాయణ, వాసం బాబు, మహిళల కార్యదర్శులుగా తమ్మ దుర్గ, తహేర, రహేన, రాజేశ్వరి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ