Tuesday, 28 July 2026 01:24:01 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి : జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్

Date : 09 February 2026 02:28 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్‌లకు నిర్వహించిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు మరియు సహాయక సిబ్బందికి ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా చేపట్టిన ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ఫారమ్–XIV స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల జారీ, ఓటింగ్ నిర్వహణ తదితర అన్ని దశలను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 23 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా జారీ చేయగా, వాటిలో 22 బ్యాలెట్లు సేవా ఓటర్లకు అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోగా, ఇందులో 13 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 27 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 27 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించారు. ఇందులో 12 మంది పురుషులు, 15 మంది మహిళలు పాల్గొన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 110 పోస్టల్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయబడగా, అందులో 110 మంది సేవా ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించారు. వీరిలో 63 మంది పురుషులు, 47 మంది మహిళలు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :