తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ పుణ్యాన రోడ్డు ఎక్కిన వైన్స్ కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల అభివృద్ధి ఏమో కానీ మద్యం దుకాణాల షాపులు పెరిగాయని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయితీలను కార్పొరేషన్ పరిధిలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే,అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా చేశారని గతంలో మండలం మొత్తం కలిపి రెండు వైన్ షాపులు ఉంటే కార్పొరేషన్ పుణ్యమంటూ ఇప్పుడు వైన్ షాపులు నాలుగుకు చేరుకున్నాయన్నారు ఒక దుకాణం మరీ దారుణంగా కాలేజీకీ కూతవేటున ఏర్పాటు చేశారని ఇది సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామని,మద్యం అమ్మకాల పాలసీని మారుస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను సైతం అదే పంథాలో నడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం కెసిఆర్ హయాంలో 75 వేల మద్యం అమ్మకాలు మొదటి నాలుగు సంవత్సరాలలో జరిపితే మొదటి రెండు సంవత్సరాలలోనే 71 వేల కోట్ల మద్యం అమ్మకాలను జరిపి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి జరగకపోగా మద్యం అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని,ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,గజ్జెల శంకర్,చందు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ