Tuesday, 28 July 2026 04:44:57 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కార్పొరేషన్ ముసుగులో కాసుల వేటనా - మధ్యం పై మాట మార్చిన రేవంత్ రెడ్డి

Date : 01 December 2025 05:00 PM Views : 168

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ పుణ్యాన రోడ్డు ఎక్కిన వైన్స్ కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల అభివృద్ధి ఏమో కానీ మద్యం దుకాణాల షాపులు పెరిగాయని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయితీలను కార్పొరేషన్ పరిధిలో కలిపితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే,అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారేలా చేశారని గతంలో మండలం మొత్తం కలిపి రెండు వైన్ షాపులు ఉంటే కార్పొరేషన్ పుణ్యమంటూ ఇప్పుడు వైన్ షాపులు నాలుగుకు చేరుకున్నాయన్నారు ఒక దుకాణం మరీ దారుణంగా కాలేజీకీ కూతవేటున ఏర్పాటు చేశారని ఇది సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామని,మద్యం అమ్మకాల పాలసీని మారుస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని మోసం చేశాడని విమర్శించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాను సైతం అదే పంథాలో నడుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పటి సీఎం కెసిఆర్ హయాంలో 75 వేల మద్యం అమ్మకాలు మొదటి నాలుగు సంవత్సరాలలో జరిపితే మొదటి రెండు సంవత్సరాలలోనే 71 వేల కోట్ల మద్యం అమ్మకాలను జరిపి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొత్త రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి జరగకపోగా మద్యం అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని,ప్రభుత్వం వెంటనే స్పందించి మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,గజ్జెల శంకర్,చందు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :