Tuesday, 28 July 2026 08:12:14 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఉద్యోగులు సమయపాలన పాటించాలి. ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 21 May 2026 06:31 PM Views : 153

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడీఓసీ కార్యాలయంలోని వివిధ శాఖల కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.తనిఖీల సందర్భంగా కలెక్టర్ ప్రతి కార్యాలయంలోని సీట్ల వద్దకు వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న సీట్లను పరిశీలించి సంబంధిత ఉద్యోగులు ఇప్పటివరకు ఎందుకు విధులకు హాజరుకాలేదని అధికారులను ప్రశ్నించారు. సరైన కారణాలు తెలియజేయకుండా ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, ఈరోజు జీతంలో కోత విధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, ప్రతి ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు తప్పనిసరిగా కార్యాలయాలకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు హాజరైన ప్రతి ఉద్యోగి హాజరు రిజిస్టర్‌లో తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. నిర్ణీత సమయానికి కార్యాలయాలకు రాకపోవడం లేదా హాజరు రిజిస్టర్‌లో సంతకం చేయని వారిని గైర్హాజరుగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని అన్నారు . ప్రతి శాఖలో అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన, క్రమశిక్షణ, పారదర్శకత పెంపొందించేందుకు ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :