తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలలపై జరుగుతున్న నేరాలను అడ్డుకొని వారికి న్యాయం చేయడానికి వీలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున ఏర్పాటు చేసిన TGWSW ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన విభాగమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు.ఈ రోజు కొత్తగూడెం పట్టణంలోని చుంచుపల్లిలో గల షీ టీమ్స్ మరియు AHTU కార్యాలయాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సందర్శించారు. ముందుగా షీ టీం మరియు AHTU కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.మహిళలపై లైంగిక వేధింపులు,ర్యాగింగ్,ఈవ్ టీజింగ్,బ్లాక్మెయిలింగ్ మరియు ఇతర ఇబ్బందులు ఎదుర్కునే మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు.జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు.ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి కి పిలిచి వారి కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.బాలికలకు,మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్స్ ను సంప్రదించాలని తెలియజేసారు.జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో,రైల్వేస్టేషన్,బస్టాండ్లు మరియు కళాశాలల వద్ద షీ టీమ్స్ సభ్యులు నిరంతరం సంచరిస్తూ ఆకతాయిల ఆగడాలను నిరోధిస్తూ మహిళలకు అండగా నిలవాలని సూచించారు.మానవ అక్రమ రవాణా చేసి వారి అవయవాలను విక్రయించడం,వారితో వెట్టిచాకిరీ చేయించడం,వ్యభిచారంలోకి లాగడం,బాల్య వివాహాలు చేయడం లాంటివి జరగకుండా AHTU సిబ్బంది భాద్యతగా పనిచేయాలని సూచించారు.ఇటువంటి నేరాలు జరగకుండా ఉండడానికి నిరంతరం జిల్లా మొత్తం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ నేరాలు జరగడానికి అవకాశం ఉండే ప్రదేశాలలో AHTU మరియు షీ టీం సిబ్బంది నిరంతరం సంచరిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీం సీఐ రాము,ఏఎస్సై నాగయ్య,మరియు షీ టీం సభ్యులు మల్లికాంబ,రాంబాబులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ