తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బెటాలియన్ కమాండెంట్ డి.శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు, అదనపు కమాండెంట్ బి.వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు రసవత్తరంగా సాగిన వార్షిక క్రీడలు ఈ రోజు విజయవంతంగా ముగిసినాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై ఫైనల్ కు ఎంపిక అయిన 4× 100 రీలే , Tug of war జట్లను ప్రారంభించారు. తదనంతర వివిధ కంపెనీల పోలీసు క్రీడా సిబ్బంది , అధికారులు కలెక్టర్ గారికి గౌరవ వందనం గా మైదానము నందు కవాతు నిర్వహించి వారికి గౌరవ వందనం ఇవ్వడం జరిగింది.అలాగే క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బంది , అధికారులకు కలెక్టర్ చేతుల మీదుగా కమాండెంట్ బహుమతులు అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు పోలీసు సిబ్బంది కి మానసిక ఉత్సాహం , శారీరక దృఢత్వం పెంపొందించడం లో క్రీడలు ఎంతగానో దోహదంచేస్తాయి అని తెలియచేశారు. అలాగే క్రీడలలో విజయం సాధించిన పోలీసు సిబ్బందిని అభినందించి, ముందు ముందు జరగబోయే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీ లలో ఎంపిక అయ్యి ,అక్కడ కూడా ఉత్తమ ప్రతిభ కనపరచాలని కోరుకుంటూ క్రీడా కారులను మరో మారు అభినందించారు అనంతరం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ కమాండెంట్ లు డి.శ్రీనివాసరావు, కె.శంకర్,ఆర్.ఐ లు ,ఆర్.ఎస్. ఐ లు మరియు బెటాలియన్ పోలీసు సిబ్బంది అందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ