Tuesday, 28 July 2026 02:39:44 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

10, 11 వార్డుల కౌన్సిలర్లకు ఆత్మీయ సన్మానం

Date : 30 January 2025 07:45 PM Views : 970

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పదవీ విరమణ ఆత్మీయ సన్మానం అనేది మరింత బాధ్యత పెంచుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఉన్నందాసు గడ్డలో శాఖ 1 ,శాఖ 2 ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఆత్మీయ పదవి విరమణ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సిపిఐ ప్రజా ప్రతినిధులకు పదవులతో సంబంధం లేదని, పదవి ఉన్నా ,లేకున్నా ప్రజల మధ్యనే ఉండి ప్రజల కోసమే కొట్లాడుతూ నిరంతరం పనిచేస్తుంటారని విరమణ అనేది ఉండదని ప్రజా సమస్యలు ఉన్నంతవరకు సిపిఐ ప్రజాప్రతినిధులు పనిచేస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. 10, 11 వార్డుల కౌన్సిలర్లుగా అనునిత్యం ప్రజల్లో ఉండి, మీ ఆదరాభిమానాన్ని పొందడం మీరు సిపిఐని వరుసగా మూడుసార్లు ఆదరించడం ,గర్వించదగ్గ విషయమని ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా సిపిఐని ఆదరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విరు ప్రజాప్రతినిధులుగా మన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారి సహకారంతో వారి శక్తి వంచన మేరకు కృషి చేశారని తెలిపారు. ఇంకా చేయవలసిన ప్రజా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని ,వాటి సమస్య సాధన కోసం ప్రజలు నిరంతరం నాయకత్వ అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు .అనంతరం బస్తీ వాసులు, స్నేహితులు 10 వార్డు కౌన్సిలర్ దంపతులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, 11 వార్డు కౌన్సిలర్ దంపతులు భూక్య శ్రీనివాస్ దేవిల ను సాబీర్ పాష చేతుల మీదుగా శాలువాతో ,పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉన్నం దాస్ గడ్డ శాఖ వన్ కార్యదర్శి సూరీమేని జనార్ధన్ ఉన్నం దాస్ గడ్డ 2 శాఖ కార్యదర్శి ఎస్కే జలీల్, సహాయ కార్యదర్శులు బానోత్ చందర్, గుగులోతు శంకర్, తోగరు నరేందర్, భూక్య మహేష్ లు ముందుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పల్లబోతు సాయి ,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా నాయకురాలు రత్నకుమారి ,షాహిన్, విజయలక్ష్మి ,ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యూం, రసూల్ దిలీప్, బానోత్ శ్రీనివాస్ నాయక్ ,సిపిఐ సీనియర్ నాయకులు కడారి మల్లేష్, కట్ట సత్యనారాయణ ,ఆది మల్లయ్య ,ఎస్కే నాగుల్ మీరా, సలీం, పూర్ణ, హరి, మహిళలు భానోత్ జానకి, కమల ,కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :