తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భదాద్రి కొత్తగూడెం మే 23 (తెలుగు వెలుగు ) : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని గిరిజన ప్రాంతాలు మరియు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు,మైదాన ప్రాంతాల్లోని వలస గిరిజన యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది.ఇందులో భాగంగానే ఈ రోజు దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో దమ్మపేట మండలంలోని కొండ రెడ్ల గ్రామమైన పూసుకుంటలో ఉండే 12 మంది యువకులకు దమ్మపేట పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్సులను ఇప్పించడం జరిగినది.ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి చేతుల మీదుగా వారికి లైసెన్స్ కాపీలను అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో,ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు.వారికి క్రీడా పోటీలు నిర్వహించడం,ఉద్యోగాలు సాధించేలా వారిని ప్రోత్సహించి కోచింగ్ ఇప్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఎంతోమంది ఏజెన్సీ ప్రాంత యువత మద్యానికి బానిసలై వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని అన్నారు.కనీసం డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేకుండా పోలీసుల వాహన తలిఖీలలో పట్టుబడుతున్నారని అన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలలో నివసించే యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ లను ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం పూసుకుంట గ్రామ యువతను వారి గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ