తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడు గణేష్ మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 16 వ డివిజన్ లో డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో మొదట తెలంగాణ గీతం ఆలాపన మరియు ముఖ్యమంత్రి సందేశం చదివి డివిజన్ ప్రజలకు వినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో డివిజన్లో చేపట్టిన రహదారులు డ్రైనేజీలు మిషన్ భగీరథ పనులు ప్రభుత్వం రెండు సంవత్సరాల మూడు నెలల్లో చేపట్టిన తదితర పథకాలను అధికారులు తెచ్చిన రికార్డులను చదివి వినిపించారు. ఈ గ్రామసభ ప్రభుత్వ పథకాలను చదివి వినిపించే విధముగా కొత్త పథకాలను మంజూరు చేసి గ్రామసభలు పెట్టుంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సబ్ జైల్ ప్రాంగణంలో గతంలో మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం సింగరేణి సంస్థ వారు స్థలం విషయంలో పర్మిషన్ జాప్యం వల్ల నిర్మాణం జాప్యం అవుతుందని అట్టి నిర్మాణాన్ని శాసనసభ్యులు కూనంనేని సహకారంతో త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలు మంచినీటి కోసం కష్టపడొద్దని ఎమ్మెల్యే కూనం నేని 125 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పథకాన్ని సాధించారని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. రెండు నెలలలో ఈ ప్రాంత ప్రజలకు ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి ఇతర పథకాల విషయంలో మా వంతు సహకారం అందిస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా ఆర్టిసి ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం పథకాలు నడుస్తున్నప్పటికీ, 500రూ.. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఉచిత కరెంటు కూడా చాలా మందికి అందటం లేదని అన్నారు. అలాగే వితంతు ,వృద్ధాప్య, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు డివిజన్ వ్యాప్తంగా 72 మంది పెన్షన్లు ఎంక్వయిరీ చేసి అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేసినప్పటికీ గత 7 , 8 సంవత్సరాల నుండి ఒక్క పెన్షన్ కూడా మంజూరు కాలేదని ఈ ప్రజా పాలన సందర్భంగా నైనా ప్రభుత్వం కొత్త పెన్షన్లను తక్షణమే మంజూరు చేసి వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వార్డు స్పెషలాఫీసర్ కి తెలియజేశారు. అదేవిధంగా గతం ప్రజా పాలనలో అర్హుల జాబితాలో లేని ఇందిరమ్మ, ఇంటి స్థలాల లబ్ధిదారులు పెన్షన్ దారులు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. అర్హులైన ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను పరిశీలించి శాసనసభ్యులు ,కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకెళ్లి పథకాలు మంజూరయ్యట్లుగా చూడాల్సిందిగా వార్డ్ స్పెషలాఫీసర్ కి విజ్ఞప్తి చేశారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇంటింటి మహిళకి 2500 రూపాయలు వేస్తామన్న పథకాన్ని అమలుపరిచి రాష్ట్ర మహిళ ఆశీస్సులను పొందాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామసభలో వార్డ్ స్పెషల్ ఆఫీసర్ శ్రావణి వార్డ్ ఆఫీసర్ శివరాం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు,ఆర్పీలు జానకి, కవిత, అంగన్వాడీ టీచర్స్ సరోజ, నీలవేణి, షహనాజ్, ఆయాలు వెంకటలక్ష్మి, డివిజన్ పెద్దలు, ముద్దం మార్తమ్మ మంగమ్మ నూనె శాంత, సిపిఐ నాయకులు అస్లాం వివిధ పార్టీల నాయకులు చనగరపు నరేష్ జుతుక దిలీప్, ఎల్ వంశీ, ఎస్ వంశీ ,మహేష్ గుంజ వెంకన్న ,ఉప్పుతల శీను తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ