Tuesday, 28 July 2026 12:40:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

స్వీయ గణనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 27 April 2026 05:22 PM Views : 136

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియ కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి డిజిటల్ జనగణన నమోదు కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో, సోమవారం రోజున కలెక్టర్ అంకిత్ తన నివాసంలో స్వయంగా స్వీయ గణన విధానంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం వల్ల ప్రజల సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితమైన సమాచారం నమోదు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మే 11వ తేదీ నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో ఇప్పటికే స్వీయ గణన పూర్తి చేసిన వారు నమోదు సమయంలో పొందిన యూనిక్ ఐడీ నంబర్‌ను తెలియజేయాలని అన్నారు. స్వీయ గణన చేసిన ప్రతి ఒక్కరు తమకు వచ్చిన ఐడీ నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని, తద్వారా ధృవీకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండవచ్చని తెలిపారు. జనగణన ప్రక్రియ దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైందని పేర్కొంటూ, జిల్లా ప్రజలు బాధ్యతతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ కోరారు. జనాభా లెక్కల స్వీయ గణనలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ప్రభుత్వానికి సరైన సమాచారాన్ని అందించడంలో సహకరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :