Tuesday, 28 July 2026 08:08:15 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

భద్రాద్రి జిల్లాలో రేడియాలజిస్ట్ సేవల్లో నూతన రికార్డ్

Date : 30 March 2026 05:11 PM Views : 216

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులు – TIFFA స్కాన్ సేవలు అందుబాటులో గిరిజన గర్భిణి మహిళలకు వరంగా మారనున్న స్కానింగ్ సేవలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించి, TIFFA స్కాన్ (Targeted Imaging for Fetal Anomalies) వంటి అత్యాధునిక స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి భద్రాద్రి వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు నూతన రికార్డును నెలకొల్పాయి. దూర ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన మాతృశిశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు దశలవారీగా తీసుకున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. గతంలోనే అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యులను నియమించడం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసూతి సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రతి నెల డెలివరీలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు, ట్యూబెక్టమీలు మరియు ఇతర మాతృసేవలు పెరిగాయి. ఈ క్రమంలో రేడియాలజీ సేవలను మరింత బలోపేతం చేస్తూ, భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ, మణుగూరు ఆసుపత్రుల్లో ఇప్పటికే TIFFA స్కాన్ సేవలు అందుబాటులో ఉండగా, అశ్వారావుపేట మరియు చర్ల ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌ల కొరత ఒక ప్రధాన సవాలుగా నిలిచింది. గత కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు ప్రయత్నాలతో TIFFA స్కానింగ్ యంత్రాలు సమకూర్చబడగా, ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్ చొరవతో కొత్త రేడియాలజిస్ట్‌ను అశ్వారావుపేట, చర్ల ఆసుపత్రులకు నియమించి ఈ లోటును పూర్తిగా అధిగమించారు. సహజంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌లను నియమించడం అత్యంత క్లిష్టమైన పని అయినప్పటికీ, జిల్లా పరిపాలన పట్టుదల, సమన్వయంతో ఈ సవాల్‌ను విజయవంతంగా ఎదుర్కొని, జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో రేడియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఇప్పటి వరకు అన్ని మాతృసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ TIFFA స్కాన్ లేకపోవడం ఒక లోటుగా ఉండగా, ఇప్పుడు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గర్భిణీలు పూర్తి స్థాయి మాతృసేవలను తమ ప్రాంతాల్లోనే పొందగలుగుతున్నారు. గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని వివరంగా పరిశీలించి, పుట్టుకలో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు TIFFA స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గర్భిణీకి సకాలంలో సరైన వైద్య నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడుతూ తల్లి-శిశువు భద్రతను మెరుగుపరుస్తుంది.అలాగే గర్భిణి స్త్రీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రయాణ సమయాన్ని, ఖర్చులను తగ్గిస్తుంది. ప్రత్యేకంగా పేద మరియు గిరిజన గర్భిణీలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని డి సి చ్ ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :