Tuesday, 28 July 2026 08:11:59 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మర్డర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు.

Date : 18 November 2025 07:41 PM Views : 519

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు.కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపూర్ తిలక్ నగర్ ఏరియాలో 10.05.2024న రామవరంకు చెందిన కోరీ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు తన మేనత్తయిన లోద్ దులారీబాయి,మేనమామ లోద్ శ్యామ్ లాల్ లపై వారి కుమారుడు లోద్ రమేష్ దాడి చేసినాడని సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ త్రాగుడుకు బానిసైన లోద్ రమేష్ ను తన భార్య గొడవ పెట్టుకుని వెళ్లిపోయినదని మనస్థాపంతో అధికంగా త్రాగుతూ తిరుగుతున్నాడు.10.05.2024 నాడు ఇంటికి చికెన్ తీసుకెళ్లి తన తల్లి లోద్ దులారీ భాయికి ఇచ్చి వండమని చెప్పాడు.తినే సమయంలో చికెన్ తక్కువయిందని గొడవ పెట్టుకుని తల్లిపై,తండ్రి శ్యామ్ లాల్ పై మరియు తన ఇద్దరు పిల్లలపై రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లోద్ రమేష్ దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు అందుకున్న అప్పటి కొత్తగూడెం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇ.రాజేష్ కేసు నమోదు చేయడమైనది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14.05.2024న నిందితుడి తల్లి దులారి బాయి చనిపోయింది.ఇట్టి కేసు విషయంలో అప్పటి ఇన్స్పెక్టర్ టి రమేష్ కుమార్ విచారణాధికారిగా వ్యవహరించి,దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్టులో 15 మంది సాక్షులను విచారణ జరిపి,ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న పిదప లోద్ రమేష్ పై నేరం ఋజువు కాగా అతనికి జీవిత ఖైదుతో పాటు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన ప్రస్తుత కొత్తగూడెం టూటౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ,నోడల్ అధికారి డి.రాఘవయ్య,కోర్టు లైజన్ అధికారి ఎన్.వీరబాబు కోర్ట్ డ్యూటీ అధికారి కోర్టు ఎల్.బిక్కులాల్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :