తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు.కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపూర్ తిలక్ నగర్ ఏరియాలో 10.05.2024న రామవరంకు చెందిన కోరీ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు తన మేనత్తయిన లోద్ దులారీబాయి,మేనమామ లోద్ శ్యామ్ లాల్ లపై వారి కుమారుడు లోద్ రమేష్ దాడి చేసినాడని సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ త్రాగుడుకు బానిసైన లోద్ రమేష్ ను తన భార్య గొడవ పెట్టుకుని వెళ్లిపోయినదని మనస్థాపంతో అధికంగా త్రాగుతూ తిరుగుతున్నాడు.10.05.2024 నాడు ఇంటికి చికెన్ తీసుకెళ్లి తన తల్లి లోద్ దులారీ భాయికి ఇచ్చి వండమని చెప్పాడు.తినే సమయంలో చికెన్ తక్కువయిందని గొడవ పెట్టుకుని తల్లిపై,తండ్రి శ్యామ్ లాల్ పై మరియు తన ఇద్దరు పిల్లలపై రాడ్డుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లోద్ రమేష్ దాడి చేసిన ఘటనలో ఫిర్యాదు అందుకున్న అప్పటి కొత్తగూడెం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఇ.రాజేష్ కేసు నమోదు చేయడమైనది.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14.05.2024న నిందితుడి తల్లి దులారి బాయి చనిపోయింది.ఇట్టి కేసు విషయంలో అప్పటి ఇన్స్పెక్టర్ టి రమేష్ కుమార్ విచారణాధికారిగా వ్యవహరించి,దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.కోర్టులో 15 మంది సాక్షులను విచారణ జరిపి,ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న పిదప లోద్ రమేష్ పై నేరం ఋజువు కాగా అతనికి జీవిత ఖైదుతో పాటు 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసిన ప్రస్తుత కొత్తగూడెం టూటౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి లక్ష్మీ,నోడల్ అధికారి డి.రాఘవయ్య,కోర్టు లైజన్ అధికారి ఎన్.వీరబాబు కోర్ట్ డ్యూటీ అధికారి కోర్టు ఎల్.బిక్కులాల్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ