తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు . మంగళవారం పాల్వంచ పట్టణంలోని ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి బోధన విధానం, అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఐదో తరగతి విద్యార్థుల చదివే నైపుణ్యాన్ని పరీక్షించి వారి ప్రతిభను అభినందించారు. అనంతరం పాఠశాల మెస్, స్టోర్రూమ్, డైనింగ్ హాల్లను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి నాణ్యతను తనిఖీ చేశారు. మెస్ మానిటర్లుగా ఉన్న విద్యార్థులతో పాటు వంట సిబ్బందితో మాట్లాడి మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నందుకు వంట సిబ్బందిని అభినందించారు. పాఠశాల ప్రాంగణాన్ని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాల అమరికను ప్రశంసించారు. విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయానికి పుస్తకాలను అందించేందుకు సహకరిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల తలుపుల మరమ్మత్తులు, డ్రైనేజీ అవుట్లెట్ సమస్య పరిష్కారం, డైనింగ్ హాల్లో విద్యార్థులకు అవసరమైన బెంచీల ఏర్పాటుపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న పరిశుభ్రతను కలెక్టర్ అభినందించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మైతిలి, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ