Tuesday, 28 July 2026 10:17:37 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

“యూరియా అధిక వినియోగం తగ్గించాలి – భూసారాన్ని కాపాడుకోవాలి” – కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 04 May 2026 09:13 PM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చుంచుపల్లి మండలంలోని ప్రశాంత్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమాల తొలి రోజు విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. రైతులు అధిక మోతాదులో యూరియా వినియోగం చేయడం వల్ల భూసారం దెబ్బతిని భూమి ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల యూరియా వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని, ఒకే పంటను వరుసగా సాగు చేయడం వల్ల భూసారం క్షీణిస్తుందని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అందించే సాంకేతిక సూచనలు రైతులు అనుసరించాలని సూచించారు.ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా భూమి ఆరోగ్య సంరక్షణ మరియు భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు చేయించిన రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేసి, వాటి వినియోగం, ప్రయోజనాలను వివరించారు. పంటల వారీగా ఎరువులను సరైన మోతాదులో, సరైన సమయంలో వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు.పంటలకు అవసరమైన పోషకాలు (మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్స్) గురించి రైతులకు అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయం విధానాలు, వాటి ప్రయోజనాలపై వివరాలు అందించారు. రాబోయే వానాకాలం సీజన్‌కు అనుగుణంగా సన్న రకాల వరి వంగడాలు మరియు వాటి సాగు పద్ధతులపై కూడా రైతులకు మార్గనిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా “రైతు ముంగిటకు శాస్త్రవేత్తలు” కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, శాస్త్రవేత్తలు గ్రామ స్థాయిలో రైతులకు నేరుగా చేరుకుని ఎరువుల యాజమాన్యం, యూరియా వినియోగం తగ్గింపు, భూసార పరీక్షల ప్రాముఖ్యత, పంట మార్పిడి విధానాలు మరియు లాభదాయక పంటల సాగుపై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు మాట్లాడుతూ, జిల్లాలోని 67 రైతు వేదికల్లో మే 4వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహం మరియు వానాకాలం పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని వివరించారు.ఈ రైతు వారోత్సవాల ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ , డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి, స్థానిక సర్పంచ్, జెడి హార్టికల్చర్, జిల్లా హార్టికల్చర్ అధికారి కిషోర్ , కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ మరియు శాస్త్రవేత్తలు, కొత్తగూడెం ఏడిఏ, చుంచుపల్లి మండల వ్యవసాయ అధికారి, ఏఈఓలు, అనుబంధ శాఖల అధికారులు, సాయిల్ శాంపిల్స్ వాలంటీర్లు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :