Tuesday, 28 July 2026 12:39:38 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సమిష్టిగా రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు కృషి చేద్దాం : ఎస్పీ రోహిత్ రాజు

Date : 03 January 2026 05:04 PM Views : 330

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్కూళ్లు,కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల కొరకు ఉపయోగించే వాహనాల ఫిట్ నెస్ పై దృష్టి సారించాలి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ రోహిత్ రాజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు - 2026 లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.శనివారం నాడు ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ముందుగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నిర్దిష్ట సైన్ బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించే విధంగా నిత్యం వాహన తనిఖీలు చేపట్టి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.ముఖ్యంగా స్కూళ్లు,కాలేజీలకు విద్యార్థులను తరలించడానికి ఉపయోగించే బస్సులు,వాహనాల విషయంలో ఖచ్చితమైన నియమ,నిబంధనలను పాటించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై నిత్యం వాహన తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ,ప్రయివేట్ బస్సుల ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్బి ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్,మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ వి.వెంకటరమణ,డి.మనోహర్,అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ ఫారుక్,రాజశేఖర్ రెడ్డి,అశోక్,రాకేష్,శ్వేత,మానస తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :