తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్కూళ్లు,కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల కొరకు ఉపయోగించే వాహనాల ఫిట్ నెస్ పై దృష్టి సారించాలి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ రోహిత్ రాజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు - 2026 లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకై పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.శనివారం నాడు ఎస్పీ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ముందుగా జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నిర్దిష్ట సైన్ బోర్డులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించే విధంగా నిత్యం వాహన తనిఖీలు చేపట్టి అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.ముఖ్యంగా స్కూళ్లు,కాలేజీలకు విద్యార్థులను తరలించడానికి ఉపయోగించే బస్సులు,వాహనాల విషయంలో ఖచ్చితమైన నియమ,నిబంధనలను పాటించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై,ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై నిత్యం వాహన తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ప్రభుత్వ,ప్రయివేట్ బస్సుల ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్బి ఇన్స్పెక్టర్ సీహెచ్.శ్రీనివాస్,డీసిఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్,మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్స్ వి.వెంకటరమణ,డి.మనోహర్,అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ ఫారుక్,రాజశేఖర్ రెడ్డి,అశోక్,రాకేష్,శ్వేత,మానస తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ