Tuesday, 28 July 2026 03:59:12 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అంతర్ పంటల సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యం కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 15 September 2025 04:37 PM Views : 430

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంతర పంటల సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.సోమవారం ములకలపల్లి మండలం మూక మామిడి పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద చేపట్టిన వెదురు సాగును జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులు కనితి భద్రయ్య, కనితి రాధా, కనితి పొట్టమ్మల పొలాల్లో స్వయంగా వెదురు మొక్కలు నాటి, గ్రామీణ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. అనంతరం మొగరాల గొప్ప గ్రామంలో రైతు కీసర సుజాత వెదురు సాగును మొక్కను నాటి ప్రారంభించారు .అనంతరం కుండ్రు వెంకటమ్మ ఎకరం పొలంలో సాగు చేస్తున్న మునగ తోటను, గడ్డం వారి గుంపు గ్రామంలో రైతు కొమ్ము బుచ్చన్న సాగు చేస్తున్న రెండెకరాల మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన కలెక్టర్ , “ప్రతి రైతు సంప్రదాయ పంటలతో పాటు కొత్త పంటలను ప్రయత్నించాలి. అంతర్ పంటల సాగు ద్వారా తక్కువ భూమిలోనూ అధిక ఆదాయం పొందవచ్చు. ఆయిల్ పామ్ తోటల్లో మునగ, బెండలను వేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. వెదురు సాగులో పెసలు, బొబ్బర్లు, మినుములు, రాగి వంటి పంటలు వేసుకుంటే కుటుంబ ఆదాయం మరింతగా పెరుగుతుంది అని అన్నారు. రైతు వేసే ప్రతి పంట కేవలం మీ కుటుంబానికే కాదు, గ్రామ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కొత్త పంటలపై నమ్మకం పెట్టుకుని సాగు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. వెదురు సాగుకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు పండించే వెదురును బెండలంపాడు బ్యాంబు క్లస్టర్ ద్వారా తయారీ ఉత్పత్తులకు వినియోగించి సులభంగా మార్కెటింగ్ చేయవచ్చు. దీని ద్వారా మీరు స్థిరమైన ఆదాయం పొందడమే కాకుండా గ్రామంలోనే ఉపాధి అవకాశాలు కూడా సృష్టించవచ్చు అని అన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ మూక మామిడి గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, తాసిల్దార్ గన్యా నాయక్, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, ఏటీఎం వెంకయ్య, ఏపీవో హుస్సేన్, ఎల్ డి ఎం సమ్మక్క మరియు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :