Tuesday, 28 July 2026 08:49:27 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జర్నలిస్టుల చిరకాల వాంఛ నెరవేరుస్తా - ఎంఎల్ఏ కూనంనేని

Date : 29 March 2025 06:47 PM Views : 851

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : * 10ఎకరాల 18గుంటలకు రక్షణ కల్పిస్తా * ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం * రిపోర్టర్ల ఐక్యత చూస్తుంటే నా జర్నలిస్టు రోజులు గుర్తుకు వస్తున్నాయి * దీక్ష శిబిరాన్ని సందర్శించి , దీక్షను విరమిపజేసిన ఎంఎల్ఏ కూనంనేని భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం, మార్చి 29 : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగా వుంటానని, వారి చిరకాల వాంఛ ఇంటి స్థలం ఇప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎంఎల్ఏ కూనంనేని సాంభశివరావు అన్నారు. శనివారం గంగా బిసన్ బస్తీలో గత పది రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమాలకు తాను వ్యతిరేకం కాదు అని, ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేసారు. జర్నలిస్టు చేస్తున్న దీక్ష ఐక్యతను తీసుకు వచ్చిందని , ప్రభుత్వం జర్నలిస్టు లకు ఇవ్వాలని అనుకున్న 10ఎకరాల 18గుంటల భూమికి చుట్టూ ఫెన్సింగ్ వేయించి బోర్డు పెట్టించే పని చేపడతానని, ఆ తర్వాత భూమి జర్నలిస్టు లకు ఎలా పంపిణి చేయాలనే అంశం పై కలెక్టర్ , యూనియన్ లకు అతీతంగా కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అనంతరం జర్నలిస్టులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులతో మాట్లాడుతూ మీలోని ఐక్యత , ఇలా అందరూ ఒకదగ్గర చేరడం చూస్తుంటే తనకు నా జర్నలిస్టు గా పని చేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పి గత స్మృతులను పంచుకున్నారు.

ఆ రోజుల్లో ఐదారుగురు మాత్రమే వుండేవాల్లమని సమాజం , ప్రజల సమస్యల పై ఎప్పుడు చర్చించేవారమని తెలిపారు. ఇలాగే ఐక్యత కొనసాగాలని, భవిష్యత్ లో మీ అందరికీ ఇంటి స్థలం ఇచ్చి మీ కోరిక నెరవేర్చుతనని జర్నలిస్టులకు మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, సీనియర్ పాత్రికేయులు జనుమాల రమేష్, T.v. నాగాచారి , కల్లోజి శ్రీనివాస్, డీవీ, రవీందర్, రవి, తారక్, వీరు, దుర్గ, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :