Tuesday, 28 July 2026 08:13:15 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సింగరేణి భవన్‌లో అన్ని ముఖ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC,TBGKS, CITU, TNTUC సమన్వయంతో కార్యాచరణ సమావేశం నిర్వహించబడింది.

Date : 22 December 2025 08:00 PM Views : 597

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు PKOC డిప్ సైడ్ బ్లాక్ వేలం సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కే దక్కేలా, అలాగే ఆ బ్లాక్ జెన్కోకు లేదా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా నిలువరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ రోజు సింగరేణి భవన్‌లో అన్ని ముఖ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC,TBGKS, CITU, TNTUC సమన్వయంతో కార్యాచరణ సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో PKOC డిప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాల్సిన అత్యవసర అవసరం, దాని ద్వారా ప్రాంతీయ ఉపాధి, సంస్థ భవిష్యత్‌ స్థిరత్వం, కార్మికుల భద్రతకు కలిగే లాభాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఈ బ్లాక్ జెన్కోకు వెళ్లకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన సంయుక్త కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.అదేవిధంగా కోయగూడెం–3 మరియు సత్తుపల్లి–3 బ్లాకులు కూడా సింగరేణి సంస్థకే దక్కేలా ఎలా కార్యాచరణ చేపట్టాలనే అంశంపై చర్చించి, ఈ విషయమై ఇంధన శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్కని కలవాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వివరించారు. త్వరలోనే అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులతో మరో సమన్వయ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశంలో INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, AITUC జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్,INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి,TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి,CITU జనరల్ సెక్రటరీ మంద నరసింహ రావ్,TNTUC అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ,TBGKS వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, TNTUC వైస్ ప్రెసిడెంట్ రాజయ్య పాల్గొన్నారు.అనంతరం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లుని కలసి, ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు.సింగరేణి సంస్థ స్థిరత్వం, కార్మికుల భవిష్యత్తును కాపాడేందుకు అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :