Tuesday, 28 July 2026 01:18:41 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రూ.2.50 కోట్ల.. 499 కిలోల గంజాయి పట్టివేత

Date : 13 October 2025 02:57 PM Views : 1492

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం నుండి రాజస్థాన్ జైపూర్‌కి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 499 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయి, మార్కెట్‌ విలువ రూ.2.5 కోట్లుగా అంచనా. CCS పోలీసులు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి గారితో కలిసి వేపలగడ్డ గ్రామంలోని అన్నపూర్ణ బేకరీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో KA38A6754 నంబరు గల అశోక్ లేలాండ్ కంటైనర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 96 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు జగదీశ్ దయారాం పాటిల్ (మహారాష్ట్ర) మరియు సంజు కుమార్ @ సంజీవ్ (కర్ణాటక) అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ గంజాయి రవాణాలో పాలుపంచుకున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం, నిందితులు ఓడిశా రాష్ట్రానికి చెందిన హరి వద్ద గంజాయి కొనుగోలు చేసి, రాజస్థాన్‌లోని జైపూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన అమిత్ రోహిదాస్ పాటిల్ కూడా కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయి రవాణా కోసం లారీ డ్రైవర్ సంజు కుమార్ రూ.4.5 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.1.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.స్వాధీనం చేసిన వస్తువుల్లో —96 గంజాయి ప్యాకెట్లు (మొత్తం 499 కిలోలు)రూ. 2.5 కోట్లు విలువఒక కంటైనర్ లారీ (KA38A6754)రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయి.ఈ ఆపరేషన్‌లో CCS CI రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సుజాతనగర్ SI రమాదేవి మరియు వారి బృందాలు కీలక పాత్ర పోషించాయి. కేసు విచారణాధికారి సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. కొత్తగూడెం డీఎస్పీ, ఎస్‌పీ ఈ బృందాన్ని ప్రశంసించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :