Tuesday, 28 July 2026 01:20:39 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 28 February 2026 08:02 PM Views : 316

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మార్చి 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక ఉత్సవాలకు సంబంధించి అన్ని శాఖల అధికారులు ముందస్తుగా అప్రమత్తమై, పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సిద్ధం చేయాలని శనివారం సంబంధిత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించనున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టకు పలు సూచనలు చేశారు.ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాలు, క్యూలైన్లు మరియు కళ్యాణ వేదిక వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి కుళాయిలు, వాటర్ ప్యాకెట్ల సేకరణ వంటి పనులను ముందస్తుగానే పూర్తి చేయాలని, ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో విద్యుదీకరణ, ఆలయ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య భద్రత కోసం వైద్య ఆరోగ్య శాఖ క్యూలైన్ల వద్ద వైద్య శిబిరాలను, అవసరమైన మందులు మరియు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని, ఏరియా ఆసుపత్రిలో అత్యవసర విభాగాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.అగ్నిమాపక శాఖ వారు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలతో సిద్ధంగా ఉండాలని, పోలీస్ మరియు ట్రాఫిక్ విభాగాలు సమన్వయం చేసుకొని వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సెక్టార్లను ఇప్పుడే ఖరారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల వసతి కోసం ఆన్‌లైన్ బుకింగ్, టికెట్ విక్రయాల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని, ఉత్సవ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఏర్పాట్లలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా భక్తులకు భక్తి పరిపూర్ణమైన అనుభూతిని అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :