Tuesday, 28 July 2026 10:23:28 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ప్రపంచానికే ఆదర్శంగా అద్భుత నిర్మాణం, తెలంగాణ ఖ్యాతిని పెంచేలా యూనివర్సిటీ నిర్మాణం, మంత్రి తుమ్మల

Date : 22 August 2025 08:19 PM Views : 493

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రపంచానికే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని(కొత్తగూడెం)ఆదర్శంగా నిర్మించేలా అద్భుత ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ప్రముఖ ఆర్కిటెక్ ఉష రూపొందించిన కొత్తగూడెం మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణ ప్లాన్ ను వైస్ ఛాన్స్ లర్ శ్రీమతి యోగితారాణా ఇతర అధికారులతో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ తలమానికంగా నిలిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌళిక సదుపాయాలతో యూనివర్సిటీ నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా నాణ్యత ప్రమాణాలతో పకడ్బందీగా ప్లాన్ ను రూపొందించాలని మంత్రి సూచించారు. విద్యార్థులు, లెక్చరర్లు అసౌకర్యం లేకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టల్లు, గ్రంథాలయాలను నిర్మించాలన్నారు. ఆర్కిటెక్ తయారు చేసిన డిజైన్లను ముఖ్యమంత్రికి త్వరలోనే చూపించి, ఆయన ఆదేశాలకు అనుగుణంగా డిజైన్లను ఆమోదం తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రారంభోత్సవ వేడుక నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. మీదుగాఈ విషయమై భద్రాద్రి కొత్తగూడం కలెక్టర్ తో మాస్టర్ ప్లాన్ గురించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాలలోనే తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మత్తులు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 3 సంవత్సరాలలో యూనివర్సిటీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ అని.. ఇది తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, దేశానికే తలమానికంగా ఆకర్షనీయమైన డిజైన్లతో దీనిని నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ 300 ఎకరాల విశాల ప్రాంతంలో రూపుదిద్దుకోని, అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల దేశ భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మాణంతో వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతో పాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు కలుగుతాయని అభిప్రాయపడ్డారు. మంత్రి తుమ్మల ప్రత్యేక కృషి...

మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చడంలో మంత్రి తుమ్మల కృషి అపారం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు ఆయన శ్రమిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం మైనింగ్ కళాశాలను అప్గ్రేడ్ చేసి ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా మార్చడంలో కీలక భూమిక పోషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కృతకృత్యులయ్యారు. ప్రపంచానికే తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయం కీర్తి ప్రతిష్టలు చాటేలా మంత్రి తుమ్మల విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఒప్పించి విశ్వవిద్యాలయంగా మార్చడంలో, బిల్లు ఆమోదించడంలో తుమ్మల చూపిన చొరవ మరువలేనిది. ఖమ్మం జిల్లా ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పేలా విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో మంత్రి తుమ్మల అలుపెరుగని పోరు చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :