తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఉపాధి హామీ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అతను విద్యాచందన తో కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు క్లస్టర్ వారిగా పని దినాలు చేపడుతున్న పనులు, ఆస్తి పన్ను వసూలు పురోగతి, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్ ఆర్ ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై జిల్లాలోని తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి పనులు కల్పించేందుకు ఎక్కువ అవకాశం గల పనులు పై దృష్టి సారించాలని, ఉపాధి కూలీలకు వంద రోజుల పని దినాలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపడుతున్న ఫారం పాండ్స్, ఫీడర్ ఛానల్ పనులు, రోడ్డు ఫార్మేషన్,ట్రంచ్ వర్కులు, బౌండరీలు తదితర పనులకు సంబంధించి అంశాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు. క్లస్టర్ల వారీగా చేపట్టే పనులలో లేబర్ మొబలైజేషన్ ఎక్కువగా ఉండాలని, వారికి పని దినాలు కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరా లో సమస్యలను సత్వరమే పరిష్కరించి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎల్ వన్ జాబితాను శనివారంలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, పిడి హౌసింగ్ శంకర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు , మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, నలిని, డి ఎల్ పి ఓ సుధీర్, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ