Tuesday, 28 July 2026 05:48:53 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాలో 1,50,000 ఎకరాలలో మునగ సాగు చేసేలా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 10 October 2024 06:31 PM Views : 619

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా లోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,మహిళా శక్తి యూనిట్లు,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక మరియు పీఎం విశ్వకర్మ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ వోలు, ఏపీవోలు, ఏపిఎంలు మరియు ఈసీఎస్ లతో ఐ డి ఓ సి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ నర్సరీల లో ఏదో ఒక మొక్కలు కాకుండా వాతావరణానికి మరియు ఆయుర్వేదంగా అనుకూలమైన మొక్కలు దొరంతో , డెకోమో, యూజీనియా , పండానాజ్ , సుబాబులు, వేప, రావి మరియు గానుగ మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని కెనాల్ ల రెండు వైపులా జామాయిల్, బాంబు, సుబాబుల్ మరియు యూకలిప్టక్స్ మొక్కలు నాటాలనిఅన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో ప్రభుత్వ ఆఫీసుల్లో, మరియు కాళీ ప్రదేశాల్లో మునగ, ఉసిరి, పనస, మారేడు, మేడి మరియు అల్లనేరేడు మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తమ పరిధిలోని గృహాలు ప్రభుత్వ ఆఫీసులు పంచాయతీ ప్రదేశాలు బట్టి ఎన్ని మొక్కలు పడతాయో అంచనా వేసుకోవాలని దాని ప్రకారం మొక్కల పెంపకం చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 1,63 వేల ఎకరాల్లో వరి సాగు, 85 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు, రెండు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, రైతులకు వీటి సాగుతో పాటు అంతర్ పంటలు మరియు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు ప్రత్యామ్నాయంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ ఫామ్ మరియు అంతర్ పంటలుగా మోరింగా సాగు, మునగ సాగు,చేపల పెంపకం, బోర్ ఉన్న పంట పొలాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని ఆ విధంగా సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఫామ్ పౌండ్, సాగుకు అవసరమైన గుంతలను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవచ్చని ఆయన తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఆయిల్ ఫామ్ తోటల్లో కోకో సాగును చేపట్టడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. జిల్లాలో 1,50,000 ఎకరాల్లో మునగ సాగు లక్ష్యంగా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం, అజోల్ల పెంపకం, నాటు కోళ్ల పెంపకం మరియు బాతుల పెంపకం ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చని, దానికి తగిన అవగాహన కల్పించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, అదనపు డిఆర్డిఓ ఎన్ రవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఇండస్ట్రీస్ మేనేజర్ పృథ్వి, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :