Tuesday, 28 July 2026 06:10:34 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏటీసీ ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Date : 08 September 2025 05:20 PM Views : 411

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకొని తమ భవిష్యత్తును బలోపాతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాల మరియు ఏటీసీ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీ భవన సముదాయాన్ని పరిశీలించారు. ఐటిఐ లను ఆధునీకరించే క్రమంలో ఏటీసీలను ఏర్పాటు చేశామని, వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఏటీసీ శిక్షణ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి వివిధ పరిశ్రమంలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థులు శిక్షణ కాలంలో కష్టపడి చదివి సంపూర్ణ నైపుణ్యాన్ని పొందాలని, వారికి కావలసిన పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఐటిఐ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు పరికరాలు కల్పించాలని దానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మణుగూరు తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ 11వ ఎన్ సి సి ఖమ్మం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్సిసి క్యాంపును సందర్శించారు. ఈరోజు ప్రారంభమైన ఈ ఎన్ సి సి క్యాంపు 17వ తారీఖు వరకు పది రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 700 మందితో ఈ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర, మరియు క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవులను కలిసి క్యాంపు వివరాలు, శిక్షణ, శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాంపు సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. క్యాంపు ప్రదేశంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్సిసి శిక్షణ ద్వారా క్రమశిక్షణ, నాయకత్వం మరియు దేశ సేవ వంటి విలువలు పెరుగుతాయన్నారు. జిల్లాలో రథం గుట్ట వంటి సహజ సౌందర్య ప్రదేశాలను ఎన్సిసి అడ్వెంచర్ క్యాంపులకు వినియోగించుకోవచ్చని, దీని ద్వారా జిల్లా పర్యాటక రంగంలో మరింత ప్రాధాన్యతను పొందుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు ఐటిఐ సూపర్డెంట్ జ్యోతిరాణి, ఏటీవోలు జీ.వీ కృష్ణారావు, వేణుగోపాల్ మరియు ఏటీసీ సిబ్బంది సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :