తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలి లేదంటే గాందీ భవనం వద్ద 1000 మంది తో 30/5/2025 నా నిరసన తెలుపుతాము. ది. 28-05-2025 నాడు కొత్తగూడెం జిల్లా పట్టణంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ శ్రీనివాస్ నాయక్ లో ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ బంజారా సంఘం తేదీ 30-05-2025 రోజున హైదరాబాద్ లో గాంధీ భవనం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం అన్ని సంఘాల నుంచి ఉంటుంది అని తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణ లో కాంగ్రెస్ పార్టీ లంబాడ సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడా సామాజిక వర్గ ఓట్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల అధికారంలోకి వచ్చిందని అని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో లంబడీ లు పేద్ద సంఖ్యలో ఉన్నారు .అలాంటి లంబాడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలోకి స్థానం కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని చెప్పారు. అగ్రకులాలకు మాత్రమే రాజకీయ అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం లంబడీ సామాజికవర్గానికి పూర్తిగా విస్మరించింది ఇప్పటికైనా రేపు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు లేకుంటే తీవ్ర వ్యతిరేకత చవిచూడాల్సి వస్తుందని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లంబాడ సామాజిక వర్గం బహిష్కరిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా లంబాడ సామాజిక వర్గం ఒక్కతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుందని ఇప్పటికైనా లంబాడ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, రాష్ట్ర కోశాధికారి భుక్యా రవికుమార్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి బోడ శ్రీనివాస్ నాయక్, జిల్లా కార్యదర్శి బోడ మంగ నాయక్, గౌరవ అధ్యక్షులు రమేష్ నాయక్ గుగులోతు బాలు నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ నాయక్ జిల్లా కార్యదర్శి ధారావత్ నాగరాజు నాయక్, జి రమేష్ నాయక్, బి అఖిల్ నాయక్, నాగేష్ బి నాగేష్ నాయక్, బి చైతన్య నాయక్, బి చరణ్ నాయక్, బి మహేష్ నాయక్, బి అర్జున్ నాయక్, టి లక్ష్మణ్ నాయక్, జానకిరామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ