Tuesday, 28 July 2026 01:19:30 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి TSUTF రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని.

Date : 08 March 2026 07:09 PM Views : 395

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (08-03-2026) న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయం టీచర్స్ భవన్ లో జిల్లా కార్యదర్శి ఎం పద్మారాణి గారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి చావా దుర్గ భవాని గారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ నేడు అన్ని రంగాలలో ముందుకెళ్తున్నప్పటికీ ఇంకా మహిళలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, సోషల్ మీడియా రూపంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధానంగా వారు పనిచేసే ప్రాంతాలలో సరైన సౌకర్యాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళ అక్రమ రవాణా వంటి అనేక దాడులు ఇంకా మహిళలపై జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేయడం కొరకు కఠిన తరమైన చట్టాలను చేయాలని కోరారు. బయట మహిళా చైతన్యం కలిగించేలా కార్యక్రమాలను ప్రభుత్వాలు రూపొందించాలని కోరారు. ఈ మహిళా చైతన్య సదస్సులో జిల్లా ఉమ్మడి పరీక్షల కార్యదర్శి నీరజ గారు, కొత్తగూడెం ఎంఈఓ మధురవాణి గారు, సుజాతనగర్ ఎంఈఓ లీలా గారు కూడా సదస్సులో పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ మహిళా చైతన్యం పెరగాలని, సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని తెలిపారు. ఈ సమస్యలు ప్రభుత్వ వైద్యశాల ఆర్థోపెడిక్ వైద్యులు వైస్ శ్రావణి గారు మాట్లాడుతూ ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి తీసుకోవలసిన ఆహారం వంటి విషయాలను వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతులు హాజరైన అతిథుల చేత అందించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ కృష్ణ, మహిళా ఉపాధ్యాయులు జానకి, వెంకటమ్మ, స్వర్ణలత, పద్మ, వసుంధర, భవాని, తులసి, వాలమ్మ, ఆర్ నాగ జ్యోతి, వెంకటమ్మ,రజియా బేగం,జిల్లా ఉపాధ్యక్షులు ఎం రాజయ్య,జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ డి దాసు, మండల బాధ్యులు రాందాస్, జి నాగేశ్వరావు, లక్ష్మణ్, ఎన్. కిరణ్,రాజారావు, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :