Tuesday, 28 July 2026 04:20:50 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం, పాల్వంచ, పరిసర గ్రామాలతో 'కుడ' ఏర్పాటుకు జీవో జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం కూనంనేని విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం...

Date : 25 October 2024 08:56 PM Views : 2981

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం : కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, పరిసర గ్రామాలను కలుపుతూ హెచ్ఎండిఏ తరహాలో కొత్తగూడెం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (కుడ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో నెంబర్ 177 జారీ అయ్యింది. 'కుడ' ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాయని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలుమార్లు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన ఫలితంగా ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు పారిశ్రామిక ప్రాంతాలుగా రోజురోజుకు విస్తరిస్తున్నాయని, షెడ్యూల్ భూములు, సింగరేణి, ఇతర పరిశ్రమల భూములు ఎక్కువగా ఉండటంతో 'కుడ' ఏర్పాటు వలన ఈ ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి సాదించేందుకు దోహదపడుతుందన్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను అభివృద్ధిలో మహానగరాలకు ధీటుగా అభివృద్ధి సాధించాలంటే 'కుడ' ఏర్పాటు తప్పనిసరిగా గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 'కుడ'ఏర్పాటుకు ఆమోదం తెలిపి జీవో జారీచేసింది కూనంనేని తెలిపారు. అనతికాలంలో జంట పట్టణాలతోపాటు నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి సాదిస్తుందని, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. తన విజ్ఞప్తిపై స్పందించి 'కుడ' ఏర్పాటుకు జీవో జారీచేసిన ప్రభుత్వానికి కూనంనేని అభినందనలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :