Tuesday, 28 July 2026 01:39:17 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఐడిఓసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

Date : 05 September 2024 06:48 PM Views : 1077

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐడిఓసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు గౌరవ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరా చారి గారి ఆధ్వర్యంలో కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారి అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు తనకు గురువులుగా ఉన్న వారందరినీ పేరుపేరునా స్మరించుకుంటూ ఉపాధ్యాయుడు జాతీయ నిర్మాతలని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఎంపిక కాని వారందరినీ తనలాగే విద్యార్థులందరూ జ్ఞాపకం పెట్టుకుంటారని వారు కూడా ఉత్తమ ఉపాధ్యాయులేనని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి నేర్చుకుంటామని వారు కూడా గురువులతో సమానమేనని ఉద్ఘాటించారు. నిత్యజీవితంలో ప్రతి విషయంలోనూ గురువులు ఉంటారని, ఏదో ఒక సరికొత్త విషయాన్ని నేర్చుకుంటూ తరగతి గదిలో విశిష్ట బోధన చేయాలని విద్యార్థుల హృదయాలలో గురువు యొక్క స్థానాన్ని పదిల పరుచుకోవాలన్నారు. తమ తల్లిదండ్రులు తనకు మొదటి గురువులను ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివరించారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు కొత్తగూడెం శాసనసభ్యులు గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తన విజయాన్ని కోరుకున్నారని ఉపాధ్యాయులు అంటే తనకు ఎనలేని గౌరవమని అన్నారు. గురువులకు ఈ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. గతంలో గురువులు, విద్యార్థి బడికి రాని సందర్భంలో ఇంటికి వెళ్లి పట్టుకొచ్చే పరిస్థితుల నుండి ప్రస్తుతం విద్యార్థులను మందలించలేని స్థాయికి విద్యావ్యవస్థ మారిందని తెలియజేశారు. గురువులు ఇతర వ్యాపకాలు చేయకుండా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గురువులు సమాజసేవకులుగా ఉండి విద్యార్థుల క్రమశిక్షణలో పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ప్రగతి సాధించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు గారు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ వేణుగోపాల్ గారు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యాచందన గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎం వెంకటేశ్వర చారి మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల నివేదికను సమర్పించారు. గడిచిన 2022, 2023 మరియు 2024 విద్యా సంవత్సరంలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక ఆయిన 100 మంది ఉపాధ్యాయులకు సన్మానం, ప్రశంసా పత్రం అందిస్తున్నట్లు తెలిపారు. వీరితోపాటు గత రెండు సంవత్సరాలలో రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ కుమార్ జిల్లా విద్యాశాఖ అకాడమీక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ షేక్ సైదులు జిల్లా బాలిక అభివృద్ధి అధికారి జే అన్నామణి ఏ సి జి ఈ మాధవరావు గారు, మీడియా ఇంచార్జి దస్తగిరి జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతలు పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో శ్రీ దుర్గసాయి నృత్యనికేతన్, అభినయ నృత్య నాట్యాలయం, కేజీబీవి పాల్వంచ విద్యార్థినులచే నృత్య కళ రూపాలు, నిర్వహించారు అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమొంటోలు అందజేసి సత్కరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :