Tuesday, 28 July 2026 05:58:46 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి.

Date : 13 January 2026 06:12 PM Views : 459

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పలు రంగాల్లో ఉచిత శిక్షణను అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ కే వెంకట రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సం.లు కలిగిన యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణకు అర్హులన్నారు. సర్వేయర్, కనస్ట్రక్షన్, ఎలక్ట్రిషన్, ప్లంబర్ జనరల్, పెయింటర్, డెకరేటర్ వంటి వాటిపై 90 రోజుల పాటు శిక్షణను అందించి నూటికి నూరు శాతం ఉపాధి కల్పిస్తామన్నారు. సర్వేయర్కు ఇంటర్ పాస్, ఐటిఐ పాసై ఉండాలని, కనస్ట్రక్షన్, ఎలక్ట్రిషన్కు పదో తరగతి ఆ పైన, మిగతా వాటికి 7వ తరగతి ఆ పై చదువులున్న వారు అర్హులని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత యూనిఫాం, షూ, హెల్మెట్, స్టేషనరీ ఇస్తారని, శిక్షణ అనంతరం న్యాక్ సర్టిఫికెట్ ఇస్తారని, ఉచిత భోజనంతో పాటు హాస్టర్ సదుపాయం ఉంటుందని చెప్పారు. అదే విధంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. శిక్షణా కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఇస్తారని, పూర్తి వివరాల కోసం యూత్ ట్రైనింగ్ సెంటర్, కొత్తగూడెం రోడ్, సుదిమళ్ల, ఇల్లెందు, 9849248650, 98074674319 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 19 తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :